శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 మే 2020 (20:35 IST)

తిరుమల శేషాచలం అడవుల్లో దేవాంగ పిల్లులు

తిరుమల శేషాచలం అడవుల్లో రెండు అరుదైన పిల్లి పిల్లలను రోడ్డు నిర్మాణ కార్మికులు గుర్తించారు. తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు సమీపంలో వీటిని గుర్తించారు. ఇవి దేవాంగ పిల్లులని అటవీ సిబ్బంది తెలిపారు.
 
ఈ పిల్లులు అరుదైన జాతికి చెందినవి అని, శేషాచలం అడవుల్లో నివసిస్తున్నాయని వెల్లడించారు. కాగా, కొన్ని గిరిజన జాతులవారు దేవాంగ పిల్లుల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని, అద్భుత శక్తులున్నాయని విశ్వసిస్తారు.

భారతీయ అటవీ చట్టం ప్రకారం వీటిని పెంచుకోవడం, అమ్మడం నేరం. అందుకే అక్కడ దొరికిన పిల్లులను అదే అడవిలో వదిలిపెట్టారు.

దేవాంగ పిల్లులు 6 నుండి 15 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. చెట్ల చిటారు కొమ్మలపై జీవిస్తూ ఆకుల్ని, పురుగుల్ని తినే ఈ చిన్న జీవుల సగటు జీవితకాలం 12 నుండి 15 ఏళ్లు.