1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Budget sessions to start from march 1st week

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

Andhra Pradesh
ఆంధ్రప్రదశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతుంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేశారు. మార్చి నెలలో ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సమావేశాలను మార్చి 4 లేదా 7వ తేదీల్లో నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. 
 
ఉగాది పండుగ నుంచి కొత్త జిల్లాల పరిపాలనను ప్రారంభించాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే, ఉగాదికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఈ లోగానే కొత్త జిల్లాల బిల్లుకు ఆసెంబ్లీ ఆమోదం పొందడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 
 
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్ సమావేశాలకే కాదు ఇకపై అసెంబ్లీలో జరిగే ఏ ఒక్క సమావేశాలకు హాజరుకారు. ఇకపై ముఖ్యమంత్రి హోదాలోనే తాను సభలో అడుగుపెడతానని ఇటీవల చంద్రబాబు భీష్మ ప్రతిజ్ఞ చేసిన విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పెరిగిన సిమెంట్ ధరలు.. బస్తాపై రూ.20 నుంచి రూ.50కి పెంపు