1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ap government decides to decrease ssc exam papers from 11 to 6

ఏపీలో పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు

ap govt
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి యేటా నిర్వహించే పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ప్రస్తుతం 11 పేపర్లతో నిర్వహించే ఈ పరీక్షను ఇకపై ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. అంటే టెన్త్ పబ్లిక్ పరీక్షా పేపర్ల సంఖ్యను ఆరుకి కుదించింది. ఈ కొత్త పరీక్షా విధానం వచ్చే యేడాది నుంచి అమల్లోకిరానుంది. 
 
జాతీయ స్థాయిలో అనేక ప్రవేశ పరీక్షలతో పాటు నీట్ పరీక్షలు సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా జరుగుతున్నాయి. ఆ స్థాయిలోనే రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర సిలబస్ ఆధారంగా జరిగే పరీక్షా విధానాన్ని మార్చాలని జగన్ సర్కారు గతంలో నిర్ణయించిన విషయం తెల్సిందే. దీనిపై సుధీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం కొత్త పరీక్షా విధానానికి ఆమోదముద్రవేసింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్: అప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాను అడ్డుకుంటామన్నారు, ఇప్పుడు ఎన్టీఆర్‌ను అమిత్ షా మెచ్చుకున్నారు...