1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ys jagan to meet pm narendra modi today

నేడు ప్రధానితో భేటీకానున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

YS Jagan
హస్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విజయవాడ గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన విషయం తెల్సిందే. ఆ రాత్రికి హస్తినలోనే బస చేసిన ఆయన... సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. 
 
ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలతో కూడా భేటీ అవుతారు. ఈ పర్యటనలో సీఎం జగన్ వెంట ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు ఉండే అవకాశం ఉంది. కానీ, ప్రధాని మోడీతో మాత్రం ఆయన ఒంటరిగా భేటీ అవుతారని సన్నిహత వర్గాల సమాచారం. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నోవాటెల్ వేదికగా అమిత్‌తో భేటీ అయిన ఎన్టీఆర్