1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. CM YS Jagan Will Tour in Bapatla District Today

నేడు బాపట్ల జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన

YS Jagan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అలాగే, జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసికం నిధులను కూడా విడుదల చేయనున్నారు. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. 
 
కాగా, ఈ జిల్లా పర్యటన కోసం ఆయన ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 10.10 గంటలకు బాపట్లకు చేరుకుంటారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన అక్కడ నుంచి హెలికాఫ్టరులో మధ్యాహ్నం 12.40 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తెలుగు రాష్ట్రాలకు పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్రం