ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (11:28 IST)

సంగం బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలో పూర్తి : మంత్రి మేకపాటి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన సంగం బ్యారేజి నిర్మాణం పనులు గత ప్రభుత్వం శీతకన్ను వేసిందని, అతి త్వరలో నిర్మాణ పనులు పూర్తిచేసి సాగు తాగు నీరు అందిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. 
 
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిలతో కలిసి సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రులు గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు గురువారం పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తిచేయడమే కాకుండా, పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సంగం, నెల్లూరు బ్యారేజీ నిర్మాణ పనులను సెప్టెంబరు అక్టోబరు లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ 1, ఫేస్ 2 పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బ్యారేజి నిర్మాణ పనులకు నిధులు సక్రమంగా కేటాయించనందున నిర్మాణం నత్తనడకన సాగిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే  నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయిందని తెలిపారు.