1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మే 2022 (13:46 IST)

విజయవాడలో దారుణం : బాలికపై ఆటో డ్రైవర్ లైంగికదాడి

rape demo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఏమాత్రం రక్షణ లేకుండాపోయింది. గత వారం రోజుల వ్యవధిలో వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా రేపెల్లె రైల్వే స్టేషనులో గర్భవతి అయిన వలస మహిళ కూలీపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం మరిచిపోకముందే విజయవాడలో ఓ ఆటో డ్రైవర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో జరిగింది. 
 
ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు నూజివీడు మండలానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికక బెంగుళూరుకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. 
 
తాను శనివారం విజయవాడకు వస్తున్నట్టు బాలికకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ బాలిక తన స్నేహితులతో కలిసి విజయవాడకు వచ్చింది. వారంతా కలిసి దుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ యువతి పాటు ఆమె స్నేహితులంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆంజనేయులు మాత్రం ఒక లాడ్జీలో ఉన్నట్టు బాలికకు చెప్పాడు. 
 
దీంతో ఆ బాలిక అతన్ని చూసేందుకు మళ్లీ వచ్చింది. ఒంటరిగా రావడాన్ని విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గుర్తించాడు. తాను లాడ్జి వద్ద దింపుతానని ఆ యువతిని నమ్మించాడు. అతని మాటలు నమ్మి ఆటో ఎక్కిన ఆ బాలికను ఆటో డ్రైవర్ నేరుగా పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే, ఆ బాలిక పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి కృష్ణలంక పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని బాలికను రక్షించాడు. అయితే, ఆటో డ్రైవర్ అప్పటికే అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.