సంబంధిత వార్తలు
- 2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్
- ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు
- Chandrababu: సభ్యత్వ నమోదులో 7.3 మిలియన్లు.. పార్టీ సరికొత్త రికార్డ్- చంద్రబాబు
- Jagan: షిప్ దగ్గరకు మాత్రం పవన్ ఎందుకు వెళ్లలేదు.. జగన్ ప్రశ్న
- మంత్రి లోకేశ్ను అభినందించిన సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?
Chandrababu: అంబేద్కర్ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ను గుర్తించడంలో ఎవరు కీలక పాత్ర పోషించారనే దానిపై చర్చ అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. తన మంత్రివర్గ సహచరులతో మాట్లాడుతూ, సున్నితమైన అంశాలను ప్రస్తావించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మంచి ఉద్దేశ్యంతో చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం వుందని సూచించారు.
వ్యవసాయంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియాలో వక్రీకరించారని, వ్యవసాయాన్ని భారంగా ముద్రవేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పాలనలో డాక్టర్ అంబేద్కర్కు తగిన గుర్తింపు లభించలేదని చంద్రబాబు నాయుడు ఎత్తి చూపారు. పార్లమెంట్ కాంప్లెక్స్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత మాజీ ప్రధాని వి.పి. సింగ్కు దక్కుతుందన్నారు.
"అంబేద్కర్ను నిజంగా ఎవరు గుర్తించారనే దానిపై చర్చ జరగాలి" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి పార్లమెంటులో బిజెపి, కాంగ్రెస్ ఎంపీల మధ్య జరిగిన ఘర్షణలో అనేక మంది గాయపడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే.
