1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. formers protests in Amaravati

436వ రోజుకు రాజధాని రైతులు, మహిళల నిరసనలు

formers
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 436వ రోజుకు చేరుకున్నాయి.

మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.

మరోవైపు విశాఖ ఉక్కు సాధిస్తామని అమరావతి రైతులు తెలిపారు. ఈ మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రైతులు, మహిళలు రిలే దీక్షలు చేస్తున్నారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
విజయవాడలో ఫైబర్ ఆపరేటర్ల అరెస్టులు.. ఎందుకో తెలుసా?