ఎర్రచందనం స్మగ్లర్లకు సమాచారం ఇచ్చాడు- డబ్బు సంపాదించాడు.. కానిస్టేబుల్ అరెస్ట్
Red Sandal
ఆర్ఎస్ఏఎస్టిఎఫ్ అధిపతి ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, టాస్క్ఫోర్స్ ఎస్పీ పి. శ్రీనివాస్ నాయకత్వంలో, ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో, డీఎస్పీ ఎండి షరీఫ్ మార్గదర్శకత్వంలో ఈ అరెస్టు జరిగింది. ఆర్ఐ సాయి గిరిధర్ నేతృత్వంలోని ఒక బృందం ఆ కానిస్టేబుల్పై నిఘా ఉంచి, అతని ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను సేకరించింది. విచారణలో, సత్తిరాజు స్మగ్లర్లకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తూ, దానికి ప్రతిఫలంగా డబ్బు తీసుకుంటున్నట్లు అధికారులు కనుగొన్నారు.
పక్కా ఆధారాలతో అతడిని అరెస్టు చేసి, క్రైమ్ నెం. 63/2025 కింద కేసు నమోదు చేశారు. ఈ అరెస్టుపై ఎస్పీ పి. శ్రీనివాస్ స్పందిస్తూ, డిపార్ట్మెంట్లో ఎలాంటి తప్పులను ఏ పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. దోషులుగా తేలిన వారిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన అన్నారు.
ఉద్యోగుల అనుమానాస్పద కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సిబ్బంది నిజాయితీతో వ్యవహరించి, తమ విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని ఎస్పీ కోరారు.
