1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Heavy Rain to Telangana State

కొనసాగుతున్న అల్పపీడనం... 24 గంటల్లో భారీ వర్షాలు

rain
కోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం కారణంగా మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. ఈ నెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వివరించింది.
 
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. నగర పరిస్థితులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్‌సాగర్‌కు భారీ వరద దృష్ట్యా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. 
 
నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలన్నారు. 'మరో 2, 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అన్ని స్థాయుల అధికారులు అప్రమత్తంగా ఉండాలి' అని తలసాని పేర్కొన్నారు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
వర్షం పడుతుందని.. బయటికి వెళ్లొద్దన్న పాపానికి ఆత్మహత్య