శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మే 2020 (13:05 IST)

పెళ్లైంది.. నలుగురు పిల్లలకు తండ్రి.. కానీ యువతిపై పలుమార్లు అత్యాచారం..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేశాడు. సోషల్ మీడియా పరిచయం ఆ యువతి కొంపముంచింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన సదరు యువతి పలుమార్లు అత్యాచారానికి గురైంది. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీకి చెందిన ఓ యువతి(27)కి టిక్‌టాక్‌లో తలాబ్‌కట్ట నషేమన్‌నగర్‌ వాసి అక్బర్‌షా(34)తో పరిచయం ఏర్పడింది. 
 
ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. గాఢంగా ప్రేమిస్తున్నానని, పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. ఆ మోసగాడి మాటలు నమ్మిన అమాయకురాలు.. తన సర్వస్వాన్ని అప్పగించింది. ఓ రోజు ఇద్దరు కలిసి టోలీచౌకీలోని అక్బర్ షా సోదరి ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక గానీ ఆ యువతికి తెలియరాలేదు.
 
చివరికి తాను మోసపోయాననే విషయం తెలుసుకుని పలుమార్లు అత్యాచారానికి గురైంది. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు పెళ్లి చేసుకుంటానని బంధువుల సమక్షంలో ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఆచూకీ లేకుండా పోయాడు. బాధితురాలు ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. అప్పటికే అక్బర్ షాకు పెళ్లైందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.