సంబంధిత వార్తలు
- చంద్రబాబు అబద్ధాలకోరు.. ప్రధాని సార్ జోక్యం చేసుకోండి.. జగన్
- కల్తీ పాపానికి పాల్పడినవారు రక్తం కక్కుకుని చావాలి : భూమన కరుణాకర్ రెడ్డి (Video)
- సనాతన ధర్మాన్ని నమ్ముతున్నా.. ప్రాయశ్చిత్తం కోసం 11 రోజుల దీక్ష: పవన్
- లడ్డూ వివాదం- ప్రకాష్ రాజ్ Vs మంచు విష్ణు.. లిమిట్స్లో వుండండి..
- తిరుపతి లడ్డూ వివాదం- వైవీ పిటిషన్పై సెప్టెంబర్ 25న విచారణ
లడ్డూ కల్తీ.. జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. భద్రత పెంపు
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అని నిర్ధారణ కావడంతో శ్రీవారి భక్తులు, వివిధ హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద బీజేపీ యువమోర్చా నాయకులు నిరసనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది.
తిరుమల లడ్డూను అపవిత్రం చేయడాన్ని కార్యకర్తలు ఖండించారు. ఆందోళనకారులు మాజీ సీఎం జగన్ ఇంటికి వెళ్లే గేటు వద్ద గుమిగూడి, జనాన్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పోలీసులకు, యువమోర్చా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
కార్యకర్తలు ప్రధాన గేటును బద్దలు కొట్టి వైసీపీ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ ఎర్రరంగు పూసి గోడలను ధ్వంసం చేశారు. వారు కూడా జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, పెద్ద గేటుతో అడ్డుకున్నారు. వైఎస్ జగన్ ఆరోపణలను ఖండిస్తూ.. వీటన్నింటి వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. దీంతో జగన్ నివాసం వద్ద భద్రతను పెంచారు.
