1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. mother killed son in Andhra pradesh

కుటుంబ కలహాలు.. కన్నబిడ్డను కడతేర్చిన తల్లి

Andhra pradesh
కన్నబిడ్డ పట్ల ఓ తల్లి కిరాతకురాలిగా మారింది. నవమాసాలు మోసి కని పెంచుకున్న ఓ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి కాటికి పంపింది ఓ తల్లి. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని రుద్రవరంలో వెలుగు చూసింది. మౌనిక అనే వివాహిత తన రెండేళ్ల కుమారుడి గొంతు కోసి చంపింది. ఆ తర్వాత ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 
 
బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మౌనిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దారుణ ఘటనకు పాల్పడడానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
విద్యార్థుల భవిష్యత్ గురించి నా కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు: సీఎం జగ‌న్‌