1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Nandi Awards 2015 Winners List

జోగయ్యగారూ.. అప్పుడేం చేస్తున్నారు.. జగన్ వచ్చాకే తెలిసిందా?

Nandi Awards
ప్రముఖ మాటల, గేయ రచయిత దరివేముల రామజోగయ్య శాస్త్రి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవార్డుల ప్రధానోత్సవంపై విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి 2016 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులను ప్రకటించింది. అయితే ఆ అవార్డుల బహూకరణ కార్యక్రమం ఇంతవరకు జరగలేదని.. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకురావాలనే ఈ ట్వీట్ చేస్తున్నట్లు చెప్పారు. 
 
నంది అవార్డులను ఇచ్చేలా చర్యలు చేపట్టాలని జగన్ విన్నవించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్‌ను పెట్టగా, నెటిజన్ల నుంచి ట్రోలింగ్స్ మొదలయ్యాయి. 
 
ఐదేళ్ల నాటి విషయంలో మొన్నటివరకు ఏం చేశారని కొందరు ప్రశ్నించగా, మరికొందరు మాత్రం రాష్ట్ర విభజన జరిగిన ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ అవార్డులు ఎప్పటికీ రావంటున్నారు. గడచిన నాలుగేళ్లలో చంద్రబాబును ఇదే విషయంపై ఎందుకు అడగలేదని ప్రశ్నిస్తున్నారు.
తర్వాతి కథనం
దివి సీమలో వానాగాలి బీభత్సం....