సంబంధిత వార్తలు
- బీజేపీ ఇచ్చిన పాచిపోయిన లడ్డూల టేస్ట్ మారిందా పవనూ? సీపీఐ రామకృష్ణ
- ఎందరు 'భీమ్లా నాయక్'లు వచ్చినా నన్నేమీ చేయలేరు.. ద్వారంపూడి
- జనసేనాని ప్రసంగాన్ని స్వాగతించిన అమరావతి రాజధాని ఐకాస
- పవన్ చిత్రాలు ఎందుకు ఫ్లావ్ అవుతున్నాయంటే : మంత్రి అవంతి వివరణ
- జనసేనపై అంబటి రాంబాబు ఫైర్.. తెలుగుదేశం పల్లకి మోయడానికి సిద్ధం కండి
పవన్ కల్యాణ్ ఉద్దేశం అదేనేమో: RRR
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూస్తామన్న పవన్ వ్యాఖ్యలను చూస్తే బాధ అనిపించినా.. నిజం చెప్పినందుకు సంతోషించాలన్నారు. పవన్ ఉద్దేశం చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయని రఘురామరాజు అభిప్రాయపడ్డారు.
"వ్యతిరేక ఓట్లు చీల్చనని పవన్ చెప్పారు. బలమైన ప్రతిపక్షాలు కలవాలి. ఇప్పటికే భాజపాతో కలిసి ఉన్నారు. పవన్ ఉద్దేశం ప్రకారం తెదేపాతో కలవచ్చు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం. మూడు పార్టీలు కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పవన్ ఉద్దేశం." అన్నారు రఘురామరాజు.
