1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 14 జులై 2021 (20:44 IST)

పెన్నా నుంచి నా పేరు తొల‌గించండి: సీఎం జ‌గ‌న్

పెన్నా ఛార్జి షీట్ నుంచి త‌న పేరు తొలగించాల‌ని సీబీఐ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై, కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది.

దీనితో సబిత డిశ్చార్జి పిటిషన్‌పై విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. మ‌రోప‌క్క హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది.

పెన్నా కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేస్తూ, ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరారు. రాజగోపాల్, శామ్యూల్ డిశ్చార్జి పిటిషన్లపై విచారణను ఈ నెల 22కు, ఇండియా సిమెంట్స్ కేసు విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.