1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 14 జులై 2021 (19:10 IST)

జ‌గ‌న్‌ని నమ్ముకుంటే జైలుకే: చంద్రబాబు విమర్శ

తెలుగుదేశం హయాంలో ఎన్నో సంక్షోభాలు వచ్చినా, వాటిని సవాలుగా తీసుకుని పని చేశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కరోనాని కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉంటే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేవాళ్లమని చెప్పారు.

మచిలీపట్నంలో ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి న‌డ‌కుదిటి నరసింహారావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. కొల్లు రవీంద్రకు నరసింహారావు మామ అవుతారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పోలీసులను అడ్డం పెట్టుకుని కొంత కాలం మాత్రమే పాలించగలరని, రైతులు తిరగబడితేకు వెళ్లారని, తట్టుకోలేరని హెచ్చరించారు. పోలీసులు కూడా హుందాగా పని చేయాలన్నారు. ఆయనను నమ్ముకున్నోళ్లంతా జైలుజగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కోసం తప్పులు చేస్తే, మీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారవుతుందని అన్నారు.