సంబంధిత వార్తలు
- అల్లు అర్జున్ 'పుష్ప'లో లేడీ విలన్గా ఎమ్మెల్యే రోజా?
- రోజాతో మాట్లాడిన బాలయ్య, ఇంతకీ ఏ విషయం గురించి...?
- రైతులకు మరో శుభవార్త.. ఉచితంగా బోర్లు : సీఎం జగన్
- డిజిటల్ అగ్రి-లావాదేవీలను ప్రోత్సహించడానికి రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేసిన అగ్రిబజార్
- రైతే రాజు.. అలాంటి రైతుకు మేలు జరగాలన్నదే లక్ష్యం : సీఎం జగన్
మీకేమైనా సమస్యలున్నాయా? రైతులను అడిగిన రోజా
చిత్తూరుజిల్లా నగరిలో రైతు భరోసా ప్రధాన గోదామును ప్రారంభించారు ఎమ్మెల్యే రోజా. రైతు రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఎంతో సంతోషంతో ఆమె రైతులతో మాట్లాడారు. మీకేమన్నా సమస్యలున్నాయా అంటూ ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. రైతు ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు లేవంటూ రైతులు చెప్పడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు రోజా.
తన సొంత నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు రోజా. లాక్ డౌన్ సమయంలో నిరుపేదలను ఆదుకున్న రోజా ఇప్పుడు రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన నేపథ్యంలో నగరిలోను రైతు భరోసా కేంద్రానికి శ్రీకారం చుట్టారు రోజా.
రైతులకు తక్కువ ధరకే విత్తనాలను పంపిణీ చేయడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రోజా చెప్పారు. రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు.
