సంబంధిత వార్తలు
- కేసీఆర్ రవాణా మంత్రిగా ఉన్నపు ఆర్టీసీ లాభాల్లో ఉన్నది... విలీనం ప్రసక్తే లేదు
- కళ్ళలో కారంచల్లి భర్తను హత్య చేసిన భార్య... ఎందుకో తెలుసా?
- తెలంగాణ ఆర్టీసీ సమ్మె: జీతాలు ఎక్కువగా ఉంటే అదనపు షిఫ్టులు ఎందుకు చేస్తాం? - మహిళా ఉద్యోగులు
- 130 కోట్ల మంది భారతీయులు చూడాల్సిన చిత్రం సైరా : తెలంగాణ గవర్నర్
- తెలంగాణ ఆర్టీసీ: ఒకప్పుడు అత్యధిక బస్సులతో గిన్నిస్ రికార్డులకెక్కిన ఈ సంస్థ భవిష్యత్ ఏంటి?
తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్టు : 19 వరకు సెలవులు పొడగింపు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ... అవి ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి.
ఈ నేపథ్యంలో, విద్యాసంస్థలకు దసరా సెలవులను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 19 వరకు సెలవులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబరు 14 నుంచి తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సమ్మె కొనసాగుతుండడంతో 15వ తేదీ వరకు సెలవులు పొడిగించారు.
కానీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి సెలవులు పొడిగించక తప్పలేదు. ఈ నేపథ్యంలో, అదనపు బస్సులు సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత ఆయన సెలవులను పొడగించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
