గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 28 జూన్ 2020 (19:41 IST)

రేపు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశద‌ర్శ‌నం టిక్కెట్ల కోటా విడుద‌ల

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం జులై నెల‌కు సంబంధించిన రూ.300 ప్ర‌త్యేక ‌ప్ర‌వేశద‌ర్శ‌న టిక్కెట్ల కోటాను సోమ‌వారం టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

రోజుకు 9 వేల టికెట్ల చొప్పున స్లాట్ల వారీగా అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా జులై 1వ తేదీ నుండి రోజుకు 3 వేలు చొప్పున స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేస్తారు.

తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంట‌ర్ల ద్వారా భ‌క్తులు ఒకరోజు ముందు ఈ టోకెన్లు పొంద‌వ‌చ్చు. జూలై 1న శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఈ నెల 30న తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తారు. 
 
జూలైలో శ్రీ‌వారి ఆల‌యంలో ప‌ర్వ‌దినాలు ఇవే...
* 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, జూలై 16న ఆణివ‌ర ఆస్థానం.
* 24న శ్రీ ఆండాళ్ తిరువాడిప్పూరం శాత్తుమొర‌, తిరుమ‌ల శ్రీ‌వారు పురిశైవారితోట‌కు వేంచేపు.
* 28న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి.
* 30 నుండి ఆగ‌స్టు 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు.