సంబంధిత వార్తలు
- రాజస్థాన్కు నూతన పీసీసీ చీఫ్.. కాంగ్రెస్ ఆఖరి అస్త్రం - కథ నడిపిస్తోంది బిజెపినే: అశోక్ గెహ్లాట్
- గుజరాత్ కాంగ్రెస్ కార్యానిర్వాహక అధ్యక్షుడిగా హార్దిక్ పటేల్
- వైసీపీ దుర్మార్గాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళుతాం: బోండా ఉమా
- బొలీవియా అధ్యక్షురాలికి కరోనా
- ఉదయగిరికి తాగునీరందించే వ్యవస్థపై అధ్యయనం చేయండి: ఉపరాష్ట్రపతి
నేడు రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎంపీలు.. ఎందుకో తెలుసా?
టీడీపీ ఎంపీలు గురువారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని టీడీపీ ఎంపీలు కలుస్తారు.
13నెలలుగా రాష్ట్రంలో పరిణామాలను రాష్ట్రపతికి ఎంపీలు నివేదించనున్నారు. ప్రాథమిక హక్కులు కాలరాయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ కాలరాయడం, రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయనున్నారు.
రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్నహింసా విధ్వంసాలు, ఇళ్ల కూల్చివేత, ఆస్తుల ధ్వంసం, భూములు లాక్కోవడం, తోటల నరికివేత, బోర్ వెల్స్ ధ్వంసం, బీసీ, ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దౌర్జన్యాల గురించి రాష్ట్రపతికి వివరిస్తారు.
అంతేకాకుండా టీడీపీతో సహా ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, దళితులపై అమానుషాలు, మానవ హక్కుల ఉల్లంఘన గురించి సాక్ష్యాధారాలతో సహా రాష్ట్రపతి దృష్టికి టీడీపీ ఎంపీల బృందం తేనుంది.
