శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం .. రాత్రి 8 గంటల వరకే విధులు...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందుకోసం పలు రకాలైన ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుని వాటిని పక్కాగా అమలుచేసేందుకు శ్రీకారం చుట్టారు. అలాగే, ఆర్టీసీ సేవలను ప్రజల ముంగింటకు తీసుకెళ్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకు మాత్రమే డ్యూటీలు వేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మహిళా కండక్టర్లు విధులు నిర్వహించే బస్సులు రాత్రి 8 గంటల లోపు డిపోలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
ఈ ఆదేశాలను అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు విధిగా పాటించాలని కోరారు. ఒక వేళ రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ వేయాల్సి వస్తే మాత్రం అందుకు తగిన కారణాన్ని ప్రధాన కార్యాలయానికి తెలియజేయాలని ఆయనఆదేశించారు. ఈ నిర్ణయంపై టీఎస్ఆర్టీసీ మహిళా కండక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.