1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YS Jagan Mohan Reddy said sorry to Sivakumar, Why

ఆ నేతకు దణ్ణం పెట్టి క్షమాపణ చెప్పిన జగన్.. ఎందుకు?

YS Jagan Mohan Reddy
అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందులో సొంత పార్టీ కాదు. ఎవరో పెట్టిన పార్టీని తెచ్చుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా గట్టెక్కాలంటే అతనికి క్షమాపణ చెప్పడమే సరైది దాని అని ఎంచుకున్నారు ప్రధాన ప్రతిపక్ష నేత. వెంటనే ఆయన్ను పిలిచి క్షమాపణ చెప్పేసి కలిసి పనిచేసుకుందామని చెప్పాడు.
 
క్షమాపన చెప్పింది జగన్ అయితే చెప్పించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్. ఇప్పటికే ఆయన పెట్టిన పార్టీ నుంచి బహిష్కరించేశారు జగన్. దీంతో న్యాయపోరాటానికి సిద్థమయ్యారు. కోర్టుకు వెళ్ళారు.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 11వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 
 
ఇక వేరే చేసేది లేక జగన్, శివకుమార్‌ను పిలిపించుకుని జరిగిందేదో జరిగిపోయింది. పార్టీ కోసం కష్టపడు. నువ్వు కూడా నాయకుడివే. కలిసి చేసుకుందామంటూ బుజ్జగించి క్షమాపణ చెప్పి పంపేశారట. ఏకంగా జగనే సారీ చెప్పడంతో శివకుమార్ శాంతించినట్లు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీ ఎన్నికల కమిషనర్ దగ్గరకు వెళ్ళి తాను చేసిన ఫిర్యాదును శివకుమార్ వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తర్వాతి కథనం
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారికి ఒక‌టే విన్న‌పం.... పవన్ కల్యాణ్