1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (16:30 IST)

అంబటి రాంబాబుకు ముచ్చటగా మూడోసారి కరోనా పాజిటివ్

గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యుడు, వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు ముచ్చటగా మూడోసారి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, అందువల్ల తనతో కాంటాక్ట్ అయినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 
 
కాగా, ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన భోగి పండుగ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయం నృత్యం చేశారు. ఈ భోగి వేడుకల్లో అనేక మంది పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ముఖానికి మాస్క్ ధరించిన పాపానపోలేదు. 
 
ఇలాంటివారిలో బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఉన్న అంబటి రాంబాబు కూడా ఉన్నారు. ఫలితంగా ఆయన కరోనా వైరస్ బారినపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు.