సంబంధిత వార్తలు
- ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- మూడు రాజధానులకు కట్టుబడివున్నాం : సజ్జల రామకృష్ణారెడ్డి
- గుర్తు పెట్టుకో సజ్జలా.. నాకు ఆడియో కాల్స్ వస్తే.. నీకు వీడియో కాల్స్ వస్తాయి.. కోటంరెడ్డి
- నేడు జగనన్న విదేశీ విద్యాదీవెనకు తొలిసారి బటన్ నొక్కుడు
- వైకాపాలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం.. సీఎం జగన్ సీరియస్
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి : అభ్యర్థులను ప్రకటించిన వైకాపా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఇందులోభాగంగా అధికార వైకాపా పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించింది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇందులో స్థానిక కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లు ఉన్నాయి. మొత్తం 18 స్థానాల్లో బీసీలకు 11, ఓసీలకు 4, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒకటి చొప్పున సీట్లు కేటాయించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే,
స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీలుగా పోటీ చేసే అభ్యర్థులు వీరే...
ఎస్. మంగమ్మ (అనంతపురం, బీసీ బోయ). డాక్టర్ మధుసూదన్ (కర్నూలు, బీసీ బోయ), రామసుబ్బారెడ్డి (కడప, ఓసీ రెడ్డి), డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు బీసీ వెన్నెరెడ్డి), మేరుగ మురళీధర్ (నెల్లూరు, ఎస్సీ మాల), కావూరి శ్రీనివాస్ (వెస్ట్ గోదావరి, బీసీ శెట్టిబలిజ), పంకా రవీంద్రనాథ్ (వెస్ట్ గోదావరి, ఓసీ కాపు), కుడిపూడి సూర్యనారాయణ (ఈస్ట్ గోదావరి, బీసీ శెట్టిబలిజ), సత్తు రామారావు (శ్రీకాకుళం, బీసీ యాదవ)లు ఉన్నారు.
ఎమ్మెల్యే కోటాలో ఏసురత్నం (గుంటూరు బీసీ వడ్డెర), మర్రి రాజశేఖర్ (గుంటూరు, ఓసీ కమ్మ), జయమంగళ వెంకటరమణ (వెస్ట్ గోదావరి, బీసీ వడ్డెర), బొమ్మి ఇజ్రాయిల్ (ఈస్ట్ గోదావరి, ఎస్సీ మాదిక), కోలా గురువులు (విశాఖ, బీసీ వడబలిజ), పోతుల సునీత (ప్రకాశం, బీసీ పద్మశాలి), పెన్మత్స సూర్యనారాయణ రాజు (విజయనగరం, ఓసీ, క్షత్రియ).
గవర్నర్ కోటాలో కర్రి పద్మశ్రీ (బీసీ, మత్స్యకార), కుంభా రవి (అల్లూరి జిల్లా, ఎస్టీ ఎరుకల)లు ఉన్నారు.
తర్వాతి కథనం
