శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (14:24 IST)

ఈ 3 చిట్కాలతో పాటిస్తే..?

మహిళలు శరీర సౌందర్యాన్ని పెంపొందించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే అందంగానే కాకుండా ఆరోగ్యంగాను ఉంటారంటున్నారు నిపుణలు. దీంతో మీ శరీర రంగులో మార్పులు సంభవించి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
 
1. పొడిబారిన చర్మం కలవారు అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె, పెరుగును కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. చర్మం ముందుదానికన్నా మెరుగ్గా తయారవుతుంది. 
 
2. మీ ముఖం ఆయిలీ స్కిన్ అయితే విటమిన్ సి (పుల్లటి పండ్లు) కలిగిన పండ్ల గుజ్జును ముఖానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలుంటే వాటిని తొలగించేందుకు ఒక చెంచా పసుపును పాలలోకాని లేదా నీటిలోకాని కలిపి సేవించండి. దీంతో మీ ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. 
 
3. శరీరంలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటే పిగ్మెంటేషన్ లేదా చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు సేవిస్తుంటే ఫలితం ఉంటుంది.