శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (14:05 IST)

మీగడ.. బ్రెడ్ ముక్కల్ని ముఖానికి కలిపి రాసుకుంటే?

మీగడలో బ్రెడ్‌ముక్కల్ని కలిపి రాసుకుంటే ముఖం మెరిసిపోతుంది. అలాగే చర్మానికి మంచి చేసే గుణం నిమ్మలో పుష్కలం. 'విటమిన్ సి'తో పాటు చర్మం మీద పేరుకున్న మురికిని తొలగిస్తుంది. అందుకని కాస్త చక్కెర, నిమ్మరసం కలిపి ముఖానికి, శరీరానికి రుద్దాలి. చక్కెర కరిగే వరకు ఇలా చేస్తే మంచి ఫలితం వస్తుంది.
 
పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని రాత్రి పూట పచ్చిపాలలో నానబెట్టి రుబ్బాలి. ఇందులో చిటికెడు కుంకుమపువ్వు, పసుపు కలిపి రాసుకోవాలి. అలాగే జీలకర్ర, క్యాబేజీ మేని మెరుపుకు తోడ్పడతాయి. ఈ రెండింటినీ నీటిలో వేసి కాసేపు ఉడికించాలి. ఆ నీళ్లు గోరువెచ్చగా అయ్యాక.. ముఖాన్ని కడుక్కోవాలి. 
 
కోడిగుడ్డులోని తెల్లసొన పోషకాలగని. దానికి తేనే జత చేస్తే ముఖానికి మంచి ఫేస్‌ప్యాక్ తయారవుతుంది. తెల్లసొన, తేనే కలిపిన ఈ ప్యాక్ వేసుకుని ఇరవై నిమిషాలు ఉంటే ముఖం మెరుస్తుంది.