1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (19:14 IST)

మీడియా రంగంలో అదానీ అదుర్స్.. IANSలో 50-50

Adani
అదానీ గ్రూప్ ఛైర్మన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ మీడియా రంగంలో రాణిస్తున్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఐఎన్ఎస్‌లో సగానికిపైగా వాటా కొనుగోలు చేశారు. ఈ డీల్ విలువ ఎంత మొత్తం అనేది స్పష్టత లేదు. అదానీ గ్రూప్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ ద్వారా 50.50 శాతం వాటా కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్.. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
 
అదానీ భారతదేశంలోని అగ్రశ్రేణి బిలియనీర్లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. అంబానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా, అదానీ గ్రూప్ గత 10 సంవత్సరాలలో విపరీతంగా అభివృద్ధి చెందింది. అన్ని రంగాలలో పట్టు సాధించింది. AMGతో మీడియా రంగంలో ఆధిపత్యం చెలాయించే అదానీ గ్రూప్ మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్ పేరుతో కంపెనీని నడుపుతోంది.
 
కంపెనీ ఇప్పటికే భారతదేశ ప్రముఖ వార్తా సంస్థ ఎన్టీలో ఉంది. తాజాగా ఏఐఎన్ఎస్ న్యూస్ కంపెనీలో 50.50 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ఏఐఎన్ఎస్ ద్వారా అదానీ గ్రూప్ వార్తా సంస్థలో కీలక ఎగ్జిక్యూటివ్‌లను నియమించడం నుండి తొలగించడం వరకు అన్ని కార్యకలాపాలను నిర్వహించగలదు.
 
ఈ కంపెనీ ఆదాయం 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.10.3 కోట్లు, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.4 కోట్లు, 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.12 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.