1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:45 IST)

కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి రైలు మార్గం.. భారత రైల్వే మైలురాయి

Railway
ఉత్తర రైల్వే సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. కాశ్మీర్‌లో భారతీయ రైల్వేస్ ప్రాజెక్టు శరవేగందా జరుగుతోంది. ఫలితంగా ఉత్తర రైల్వే జోన్ మరో మైలురాయిని సాధించింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్‌లోని బనిహాల్ సమీపంలో ఉన్న బంకోట్ ప్రాంతంలో మరో సొరంగం ఉంది. 
 
ఇప్పటికే ఐఆర్ కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బనిహాల్ మరియు ఖారీ సెక్టార్ మధ్య రైల్వే సొరంగాల తవ్వకం పనులను చాలా వరకు పూర్తి చేసింది. కత్రా మరియు బనిహాల్ మధ్య 110 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో కాశ్మీర్ రైల్వే ప్రాజెక్టుపనులు జరుగుతున్నాయి. ఇది రాబోయే రెండేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. 272 కిలోమీటర్ల ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గంలో భాగంగా, కాశ్మీర్ మరియు దేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య ప్రత్యామ్నాయ ఉపరితల సంబంధాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
 
అధికారిక వర్గాల ప్రకారం.. బంకోట్‌లో సుమారు 2 కిలోమీటర్ల పొడవైన సొరంగ ప్రాజెక్టును రెండు భాగాలుగా రూ.300 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి రైలులో ప్రయాణించడం ప్రారంభమవుతుందని, గడువును సాధించడానికి రాంబన్‌లో పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని రాంబన్ అదనపు డిప్యూటీ కమిషనర్ హర్బన్ లాల్ శర్మ తెలిపారు. 
 
53 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్ యొక్క 96% భూగర్భ సొరంగాల గుండా వెళుతుంది, 11,000 సొరంగాలు (550 హెక్టార్ల వైశాల్యం) కంటే ఎక్కువ కొలత కలిగిన భూమిని జాతీయ రవాణాదారుకు అప్పగించినట్లు శర్మ తెలిపారు.
 
బీగ్ కన్ స్ట్రక్షన్ కంపెనీ ఎండి ఇమ్రాన్ బీగ్ ప్రకారం, కాశ్మీర్ రైలు మార్గం ప్రాజెక్టులో రైల్వే సొరంగాల తవ్వకంలో మొదటిసారిగా రోడ్ హెడర్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా రైలు సొరంగాల లోపల పేలుళ్ళు నిర్వహించాల్సిన అవసరం లేదు.
 
కానీ ఇది కొన్నిసార్లు సొరంగాల వెంట వచ్చే సమీపంలోని నివాస గృహాలను దెబ్బతీస్తుందని ఎండి తెలిపారు. టన్నెల్ నంబర్ 77 పూర్తి చేయడానికి బీగ్ కనస్ట్రక్షన్ కంపెనీకి ఏడాది గడువు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గడువులోపు ఈ ప్రాజెక్టును కంపెనీ పూర్తి చేస్తుందని ఎండి ఆశాభావం వ్యక్తం చేశారు.