శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (16:00 IST)

గ్యాస్ బాదుడే బాదుడు, రూ.144.50 పెంచిన మోదీ సర్కార్, కట్టెల పొయ్యి తప్పదేమో?

ఇదివరకు ఏదో పుల్లలు తెచ్చుకుని కట్టెలపొయ్యిపై వంటలు చేసుకునేవారు. పుల్లలికి మహా అయితే రూ 300 లేదంటే రూ. 400 అయ్యేది. అలాంటి సమయంలో గ్యాస్ సిలిండర్లు వచ్చాయి. తొలుత వీటి ధర రూ. 100 నుంచి రూ. 150 వరకూ వుండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలామంది కట్టెపుల్లల పొయ్యిని వదిలేసి గ్యాస్ స్టౌలకు అలవాటు పడ్డారు. 
 
 
దానితో గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఎల్పీజీ సిలిండర్‌ పైన రూ.144.5 మేర ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనితో పెరిగిన ధరలతో కలిపి రూ.858.50కి చేరుతుంది ఎల్పీజీ సిలిండర్ ధర. కాగా ఇటీవలి కాలంలో ఇంత భారీగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచటం ఇదే తొలిసారి.