సంబంధిత వార్తలు
- నెల్లూరు జిల్లాలో అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ థియేటర్ కట్టిన ప్రభాస్..
- మోటోరోలా వన్ యాక్షన్ స్మార్ట్ఫోన్ విడుదల.. ఎంత ప్రత్యేకమో చూడండి?
- కిక్ ఇస్తున్న కియా కారు... మేడిన్ ఆంధ్రా, ధర ఎంతో తెలుసా?
- సిద్ధార్థ ఆత్మహత్య... లాభాల బాటపట్టిన కాఫీ డే
- డీటీహెచ్ బిల్లులు చూసి బెంబేలెత్తిపోతున్న కస్టమర్లు.. రంగంలోకి ట్రాయ్
జీవనకాల గరిష్టానికి పసిడి ధర
పసిడి ధర ఆకాశానికి తాకుతోంది. ఫలితంగా జీవనకాల గరిష్టానికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చిన విషయం తెల్సిందే. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రోజురోజుకూ పతనం కావడం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న బలమైన సంకేతాలతో వరుసగా ఐదో రోజు ఈ లోహాల ధరలు పెరిగాయి.
సోమవారం ఒక్కరోజే రూ. 675 పెరిగి పసిడి ధర జీవనకాల గరిష్టాన్ని తాకింది. సోమవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.39,950కు చేరింది. ఆగస్టు 20 నుంచి ప్రతిరోజూ పుత్తడి ధర పెరుగుతూనే ఉంది. అటు వెండి కూడా సోమవారం బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో నేటి మార్కెట్లో వెండి ధర రూ.1,450 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ. 46,550 పలికింది.
తర్వాతి కథనం
