1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Case of omicron found in Dharavi, Mumbai

ధారావిలో తొలి ఒమిక్రాన్ కేసు- అధికారుల్లో టెన్షన్

omicron
కరోనా వైరస్ ముంబై నగరంలోని ధారావి ప్రాంతంలో భయంకరంగా వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఒమిక్రాన్ కూడా ధారావిని తాకింది. దీంతో ముంబై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 
 
దక్షిణాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మన దేశాన్ని కూడా పలకరించింది. ఇప్పటికే దేశంలో 25 ఒమిక్రాన్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. 
 
ఆసియాలోన అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావిలో ఒమిక్రాన్ కేసు బయటపడింది. ధారావికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్థారణ అయ్యింది. 
 
డిసెంబర్ 4న ఆయన టాంజానియా నుంచి ముంబై చేరుకున్నారని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారిని ట్రాక్ చేసే పనిలో పడ్డారు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మదనపల్లెలో మునక్కాయ కిలో రూ.600