1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (13:24 IST)

రోజురోజుకూ పెరుగుతున్న ఒమిక్రాన్ భయం - ఫోన్లు స్విచాఫ్ చేసిన ప్రయాణికులు

దేశంలో ఒమిక్రాన్ వైరస్ భయం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే మన దేశంలో ఈ కేసులు వెలుగు చూశాయి. ఈ వైరస్ పట్ల అంతగా భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, ప్రజలు, ప్రభుత్వాలు మాత్రం భయంతో వణికిపోతున్నాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అనేక చర్యలను చేపడుతున్నాయి. కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా కొత్త మార్గదర్శకాలను శుక్రవారం రిలీజ్ చేసింది. 
 
ఇదిలావుంటే, ఈ నెల ఒకటో తేదీ నుంచి వివిధ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 12,500 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో 1,700 మంది విశాఖ జిల్లాకు చెందినవారు. అంతేకాకుండా, విదేశాల నుంచి వచ్చిన వారిలో 9 వేల మంది అడ్రస్‌లను అధికారులు గుర్తించారు. కానీ, మరో 3500 మందిని సంప్రదించడానికి అధికారులు ప్రయత్నించగా, వారు తమ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేశారు. దీంతో వారిని సంప్రదించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాస్‌పోర్టుల్లో ఉన్న చిరునామాలా ద్వారా వారిని గుర్తించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.