1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (10:16 IST)

దేశంలో మరో 39 వేల పాజిటివ్ కేసులు - తెలంగాణాలో?

దేశంలో కరోనా వైరస్ కేసుల క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 39 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 32,981 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,77,203కి చేరింది. ఇక గత 24 గంటల్లో 39,109 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 391 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,40,573కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,39,901 మంది కోలుకున్నారు. 3,96,729 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,77,87,656 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,01,081 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో 517 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 862 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,73,858కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,64,606 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,474కి చేరింది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 7,778 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,803 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102, రంగారెడ్డి జిల్లాలో 57 కరోనా కేసులు నమోదయ్యాయి.