గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: బుధవారం, 19 ఆగస్టు 2020 (10:29 IST)

దేశంలో కరోనా విజృంభణ, కొత్తగా 64,531 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. కరోనా మహమ్మారి రోజురోజుకి పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 27 లక్షల 67 వేలను దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 64,531 కేసులు నమోదు కాగా 1092 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60,091 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 27,67,273 కేసులు నమోదయ్యా యి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,76,514 ఉండగా 20,37,870 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలాఉండగా 52,889 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితులు రికవరీ రేటు 73.64 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.91 శాతానికి మరణాల రేటు తగ్గింది. కాగా యాక్టివ్ కేసుల శాతం 24.45 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,01,518 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,17,42,782కు చేరింది.