శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శనివారం, 14 నవంబరు 2020 (19:44 IST)

కోవిడ్ కోరల నుంచి 92.97 శాతం మంది బయటపడి ఇళ్లకు చేరుకున్నారు

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా 50 వేలకు దిగువనే పాజిటివ్ కేసులు నమోదు కావడం, క్రియాశీల కేసుల సంఖ్య ఐదు లక్షల లోపులో ఉండటం కాస్త ఊరట కలిగించే అంశాలు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 44,684 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 87,73,479కి చేరింది.
 
అలాగే, శుక్రవారం క్రియాశీల కేసుల సంఖ్య 4,80,719 గా ఉండగా.. ఆ రేటు 5.55 శాతానికి తగ్గింది.
ఇక, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 81,63,572 (92.97శాతం) మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే కోలుకున్న వారి సంఖ్య 47,992 గా ఉంది.
 
ఈ మహమ్మారి కారణంగా శుక్రవారం 520 మరణాలు సంభవించగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 1,29,188 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో ప్రభుత్వం 9,29,491 నమూనా పరీక్షలు నిర్వహించింది. దాంతో ఇప్పటివరకు 12,40,31,230 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లయింది.