1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Hindu group hosts cow urine drinking party to ward off coronavirus

కరోనా వైరస్‌కు గోమూత్రంతో విరుగుడు

Coronavirus
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నారు. ఈ వైరస్‌ విరుగుడుకు ఇప్పటివరకు మందు కొనగొనలేదు. దీంతో ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడ్డారు. ఇలాంటి వైరస్‌కు గోమూత్రం చక్కని ఔషధంగా పని చేస్తుందని అఖిల భారతీయ హిందూ మహాసభ పేర్కొంది. 
 
ఈ మేరకు 'గోమూత్ర పార్టీ' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో స్వామి చక్రపాణి మహరాజ్ సహా ఆయన బృంద సభ్యులు గోమూత్రాన్ని తాగారు. అంతేకాదు, కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 200 మంది కూడా గోమూత్రాన్ని తాగారు. 
 
ఈ సందర్భంగా స్వామి చక్రపాణి మాట్లాడుతూ.. గోమాంసం తిన్నందు వల్లే కేరళలో వరదలు సంభవించాయన్నారు. గోమూత్రం తాగితే కరోనా దరిచేరదన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి 'గోమూత్ర పార్టీ'లను మరిన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతామని ఈ సందర్భంగా స్వామి చక్రపాణి మహరాజ్ పేర్కొన్నారు.
 
తాము 21 సంవత్సరాల నుంచి గోమూత్రం తాగుతున్నామని, ఆవు పేడతో స్నానం చేస్తున్నామని పార్టీకి హాజరైన ఓ ప్రకాశ్ తెలిపారు. ఈ కారణంగా ఇంగ్లీష్ మందులు వాడాల్సిన అవసరం తమకు రాలేదన్నారు. కేన్సర్‌ను నివారించేందుకు గోమూత్రం చక్కని ఔషధంలా పనిచేస్తుందని కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కరోనా విజృంభణ : పార్కులు మూసివేత - దేశంలో 107 కేసులు