శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (13:56 IST)

ఇద్దరు పిల్లల ప్రిన్సిపాల్... ఉపాధ్యాయురాలితో రెండో పెళ్లి

ఇద్దరు పిల్లల ప్రిన్సిపాల్.. ఓ ఉపాధ్యాయురాలిపై మనసుపడ్డాడు. తొలి భార్యకు తెలియకుండా ఉపాధ్యాయురాలిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన యువతి బంధువులు, కుటుంబ సభ్యులు పాఠశాలపై దాడి చేసి ప్రిన్సిపాన్‌ను చితకబాదారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్‌లో జరిగిందీ ఘటన.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హబీబ్ ఫాతిమా నగర్‌కు చెందిన అయూబ్ అలీ (42) అనే వ్యక్తి కార్మిక నగర్‌లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. అతడికి అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. భార్యకూడా ఉంది.
 
అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలి(23)తో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమె వద్ద తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి, మాటలతో మభ్యపెట్టి ఎవరికీ తెలియకుండా రెండో పెళ్ళి చేసుకున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన యువతి బంధువులు, కుటుంబ సభ్యులు శనివారం పాఠశాలపై శనివారం దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో ఫర్నిచర్, కంప్యూటర్, పూలకుండీలు ధ్వంసమయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయూబ్ ఖాన్‌ను అరెస్టు చేశారు.