శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (18:47 IST)

ఏపీలో కొత్తగా 5674 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 5674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,068 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 166 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 45 మంది మహమ్మారి వల్ల మృతి చెందారు. 8,014 మంది డిశ్చార్జ్ అయ్యారు.
 
తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 18,44,917కి చేరగా... 17,67,404 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,269 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65,244 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
మరోవైపు, దేశంలో గత 24 గంటల్లో 60,753 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 97,743 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. మరో 1,647 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,85,137కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,86,78,390 మంది కోలుకున్నారు. 7,60,019 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇక వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 27,23,88,783 డోసులు ఇవ్వడం జరిగింది.