శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (16:05 IST)

సచిన్ భారీ విరాళం.. ఇటలీలో 8,165కి చేరిన కరోనా మృతుల సంఖ్య

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా మహమ్మారిపై పోరాటానికి తన వంతు విరాళం ప్రకటించాడు. దేశంలోని ప్రముఖులు సామాజిక బాధ్యతతో స్పందిస్తూ భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.

భారత్‌లో కరోనా కేసుల పెరుగుదల నిష్పత్తి ఆందోళనకరంగా ఏమీ లేకున్నా.. వైరస్ వ్యాప్తిని దృష్టిలో వుంచుకుని మున్ముందు కూడా కఠినంగా వ్యవహరించాలని కేంద్రం భావిస్తోంది. 
 
ఇదిలా ఉంటే కరోనా మృత్యుఘోషతో ఇటలీ అట్టుడికిపోతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి మృత్యు ఒడిలోకి చేరిపోతున్నారు. దీనిని అరికట్టేందుకు, ఆ మహమ్మారి బారి నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు ఇటలీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ తగిన ఫలితాలనివ్వడం లేదు.

గత 24 గంటల్లోనే 662 మంది కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని కన్నుమూశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరితో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 8,165కు చేరింది.