1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Today Covid Media Bulletin

దేశంలో మళ్లీ 40 వేలు దాటిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Covid Media Bulletin
దేశంలో కొత్తగా మరో 41 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య బుధవారంకంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
గత 24 గంటల్లో 41,806 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880కు చేరింది. ఇందులో 3,01,43,850 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 4,32,041 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 
 
మరోవైపు, ఇప్పటివరకు 4,11,989 మంది మహమ్మారి వల్ల మరణించారు. ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 39,130 మంది కొత్తగా డిశ్చార్జీకాగా, 581 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కేరళలో విజృంభిస్తున్న జికా వైరస్.. 28కి చేరిన కేసుల సంఖ్య