1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మే 2024 (10:20 IST)

టెన్త్ మార్క్ లిస్టు కోసం స్కూలుకెళ్లిన బాలిక.. సహచర విద్యార్థి అత్యాచారం!!

victim girl
పదో తరగతి మార్కుల జాబితాను తీసుకునేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఓ విద్యార్థినిపై సహచర విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను బలవంతంగా తరగతి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో కామాంధుడి స్నేహితులు మరో నలుగురు ఈ తతంగాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగారు. దీనిపై బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఐదుగురు కామాంధులను జైలుకు తరలించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగింది.
 
మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి మార్కుల జాబితాను తీసుకునేందుకు స్కూలుకు వచ్చింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా అప్పటికే అక్కడున్న సహచర విద్యార్థి ఆమెను తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను బాలసుబ్రహ్మణ్యం (22), చంద్రశేఖర్ (22), తేజా (19), హరికృష్ణ (19) వీడియో తీశారు. ఆ తర్వాత ఆ దృశ్యాలు చూపించి బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. 
 
అంతేకాదు, వాటిని బాధిత బాలిక తల్లిదండ్రులకు చూపించి డబ్బులు డిమాండ్ చేశారు. రూ.2 లక్షలు ఇస్తామని చెప్పినా, సరిపోవని, ఇంకా పెద్దమొత్తంలో కావాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడి బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. వీడియో తీసిన నలుగురు యువకులను అరెస్టు రిమాండుకు తరలించారు.