1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Maths teacher awarded honorary doctorate

గణిత ఉపాధ్యాయుడికి గౌరవ డాక్టరేట్ ప్రదానం

Maths
Maths
మద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కట్టుంగ సీతా రామాంజనేయులుకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. కర్ణాటకకు చెందిన భారత్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇటీవల బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 
 
యూనివర్సిటీ డీన్ డాక్టర్ పీఎం స్వామినాథన్ ఆయనకు అవార్డును అందజేశారు. మంగళవారం మద్దూరులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రామాంజనేయులును తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, డీఈవో ఈవీబీఎన్‌ నారాయణ, ఇతర అధికారులు అభినందించారు. 34 ఏళ్లపాటు అద్భుతమైన బోధనా నైపుణ్యాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు.
About Writer
సెల్వి