సంబంధిత వార్తలు
- ఆటోడ్రైవర్లు ఘాతుకం, 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్
- గాంధీ కేసులో వీడని మిస్టరీ.. పరీక్షల్లో కనిపించని క్లోరోఫాం ఆనవాళ్లు
- పేషెంట్ కోసం అటెండర్గా వెళ్లిన అక్కాచెల్లెళ్లు.. మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఎక్కడ?
- కొడుకు స్నేహితుడే కదా అని చేరదీస్తే అత్యాచారం చేశాడు
- పిల్లలు పుట్టిస్తా అంటూ మూడు రాత్రులు వివాహితపై అత్యాచారం చేసిన మంత్రగాడు
గాంధీ ఆసుపత్రి అత్యాచార నిందితుడు: ఆమె ఇష్టంతోనే చేశా
గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచార ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో కనిపించకుండా పోయిన సెక్యూరిటి గార్డు విజయ్ కిషోర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బాధితురాలిపై అత్యాచారం చేశానని ఒప్పుకున్నాడు. కాగా నిందితుడు విజయ్ స్వస్థలం కాజిపేట్ అనీ, అతడికి 8 ఏళ్ల క్రితం పెళ్ళయిందని పోలీసులు తెలిపారు. గత నెల 27న గాంధీ ఆసుపత్రిలో సెక్యురిటి గార్డ్గా చేరిన ఇతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పోలీసుల విచారణలో అతడు బాధితురాలి ఇష్టపూర్వకంగానే తను అలా చేసినట్లు చెప్పాడు. మరోవైపు కనిపించకుండా పోయిన మహిళ గురువారం ఉదయం నారాయణగూడ మెయిన్ రోడ్ వద్ద మెడికల్ షాప్ ముందు గుర్తించి ఆమెను పోలీసు స్టేషనుకు తరలించారు.
