గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 మే 2023 (22:11 IST)

ఉరేసుకున్న ప్రియుడు.. విషం సేవించిన ప్రియురాలు.. ఎక్కడ?

lovers
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడి ఉరేసుని ప్రాణాలు తీసుకుంటే, ప్రియురాలు విషం సేవించి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న గొల్లవానితిప్పకు చెందిన శ్యామ్, జ్యోతిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. జ్యోతి గత 20 రోజులుగా కెపీహెచ్‌‍బీ కాలనీలోని ఒక వసతి గృహంలో ఉంటున్నారు. శ్యామ్ మాత్రం తన స్నేహితుడు కృష్ణ వద్ద కేపీహెచ్‌బీ కాలనీలోని ఏడో ఫేజ్‌లో ఉంటున్నాడు. ఇంటీవల కృష్ణ వద్దకు శ్యామ్ వచ్చాడు. కృష్ణ ఊరికి వెళ్లడంతో గది తాళాలు అడిగి తీసుకున్నాడు. 
 
మూడు రోజుల క్రితం శ్యామ్, జ్యోతిలు కలిసి కృష్ణ గదికి వచ్చారు. ఈ ఉదయం నుంచి రూమ్ నుంచి దుర్వాసన వస్తుండటంత చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడు చేరుకున్న పోలీసులు గదిని తెరిచి చూడగా, ఇద్దరూ విగతజీవులై కనిపించారు. శ్యామ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకోగా, జ్యోతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు జ్యోతికి గతంలోనే వివాహం జరిగినట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.