1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

రూ.150 కోసం బండరాయితో కొట్టి చంపేశారు... సైకో మృత్యుకేళి

murder
పల్నాడు జిల్లా నరసారావు పేటలో జంట హత్యలు చోటుచేసుకున్నాయి. ఇవి స్థానికంగా కలకలం సృష్టించాయి. ఈ జంట హత్యల్లో మృతులిద్దరినీ కేవలం రూ.150 కోసం బండరాయితో కొట్టి చంపేశారు. నరసారావు పేట రైల్వే స్టేషన్ రోడ్డులో ఈ జంట హత్యలు జరిగాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రైల్వే స్టేషన్ రోడ్డులో మృతి చెందిన ఇద్దరు మద్యం సేవించి మరణించివుంటారని భావించారు. అయితే, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి రంగంలోకి దిగి స్థానికంగా ఉండే సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించగా, అవి హత్యలుగా తేలింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జిల్పా ఎస్పీ పర్యవేక్షణలో జంట హత్యలు జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
 
ఈ హత్యలకు పాల్పడింది. తన్నీరు అంకమ్మరావుగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన అంకమ్మరావు గత జూన్ నలలో నగదు కోసం ఓ మహిళను హతమార్చిన కేసులో అరెస్టయ్యాడు. సాక్ష్యాధారాలు లేక పోవడంతో మార్చిలో జైలు నుంచి బయటకువచ్చాడు. 
 
అలాగే, బుధవారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ రోడ్డులో పడుకుని ఉన్న తెలంగాణలోని మహబూబాబాద్‌కు చెందిన సంతోష్ రెడ్డి (45)ని బండ రాయితో మోది హతమార్చి అతని వద్ద ఉన్న రూ.30 దోసుకున్నాడు. 
 
ఆ తర్వాత సమీపంలోనే మరో గుర్తు తెలియని వ్యక్తిని కూడా ఇదే తరహాలో చంపి అతని వద్ద ఉన్న రూ.120 తీసుకున్నాడు. కాగా, విచారణ సమయంలో ఈ నెల 5న మార్కెట్ సెంటరులో 400 కోసం ఓ మహిళను హతమార్చినట్లు ఈ సైకో కిల్లర్ అంగీకరించాడు.