1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (11:53 IST)

వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు వ్యక్తులు అరెస్ట్

వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీకాలనీలోని రోడ్డు నెంబర్‌ 4లో ఎంఐజీ గృహాన్ని అద్దెకు తీసుకున్న బి.రాజు (52), నూర్‌పాషా కాసింబీలు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. 

 
ఇక్కడికి ఓ మహిళను రప్పించి గుట్టుచప్పుడు కాకుండా విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం ఆకస్మికంగా దాడి చేసి నిర్వాహాకులిద్దరితో పాటు మహిళను, శేరిలింగంపల్లికి చెందిన విటుడు కృష్ణారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు.