సంబంధిత వార్తలు
- పట్టాభి అరెస్టు వ్యవహారంలో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు
- పెళ్ళయ్యింది, శోభనం వద్దన్న భార్య, వెక్కి వెక్కి ఏడ్చిన భర్త, చివరకు?
- ప్రపంచమంతా నిద్రపోయినా పోలీసు ఒక్కడే మేల్కొని ఉంటాడు
- Former Miss Telangana Suicide attempt: క్షణాల్లో కాపాడిన పోలీసులు
- కరోనా వేళ 206 మంది పోలీసులను కోల్పోయాం : డీజీపీ గౌతమ్ సవాంగ్
ఎల్బీ నగర్లో 110 కేజీల గంజాయి స్వాధీనం
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ఏరులై పారుతోంది. అనేక ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్లో గంజాయి భారీగా పట్టుబడింది.
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి మహారాష్ట్ర, నాగ్పూర్కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.