1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Student Kills Girl, Then Shoots Himself In 3-Second Classroom Horror

తరగతి గదిలో విద్యార్థినిని తుపాకీతో కాల్చి తాను కాల్చుకున్న విద్యార్థి.. ఎక్కడ?

gunshot
పంజాబ్ రాష్ట్రంలోని తరన్ తారన్ జిల్లాలో ఓ అత్యంత దారుణ ఘటన జరిగింది. సోమవారం ఓ యువకుడు తన వెంట తెచ్చుకున్న తుపాకీతో సహ విద్యార్థినిని తరగతి గదిలోనే కాల్చాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో విద్యార్థినిని ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు మాత్రం తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ భయానక దృశ్యాలన్నీ తరగతి గదిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మృతురాలిని నౌషెహ్రా పన్నువాన్‌ గ్రామానికి చెందిన సందీప్ కౌర్‌గా, నిందితుడుని జలంధర్ జిల్లా మల్లియాన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్‌గా గుర్తించారు. వీరిద్దరూ ఉస్మా గ్రామంలోని ఒక లా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నారు. 
 
సీసీటీవీ ఫుటేజీ అధారంగా ఉదయం 9.15 గంటల సమయంలో ప్రిన్స్ రాజ్ తరగతి గదిలోకి ప్రవేశించాడు. అతన్ని చూసిన సందీప్ కౌర్.. ఏదో కామెంట్స్ చేయగా, ఆమె వెనుకనే అతను వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే తన బ్యాగులో నుంచి తుపాకీ తీసి నిలబడి వున్న సందీప్ కౌర్ తలలో కాల్చాడు. ఆ తర్వాత కొన్ని అడుగులు ముందుకు వేసి తన తలలోకి కూడా కాల్చుకున్నాడు. ఈ ఊహించని ఘటనతో తోటి విద్యార్థులు షాక్‌కు గురై పరుగులు ప్రాణభయంతో తరగతి గది నుంచి పరుగులు తీశారు. 
 
ప్రిన్స్రాజ్ ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
యూపీఐ నుంచే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. ఎప్పటి నుంచి అంటే....